ఐర్లాండ్తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో భారత జట్టు ఊహించని పరాజయాన్ని ఎదుర్కోవడంతో, జూన్ 28న జరగనున్న రెండో టీ20 కోసం భారత జట్టులో కీలక మార్పులు చేయాలని యాజమాన్యం నిర్ణయించినట్లు సమాచారం.
మొదటి మ్యాచ్లో అభిషేక్ శర్మ 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో అదరగొట్టినా, మరో ఓపెనర్ సంజూ శాంసన్ విఫలం కావడం, బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ 4 ఓవర్లలో 57 పరుగులు సమర్పించుకోవడం జట్టు ఓటమికి ప్రధాన కారణాలయ్యాయి. దీంతో రెండో మ్యాచ్లో వీరిద్దరిని తప్పించాలని జట్టు యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
సంజూ శాంసన్కు బదులుగా 15 ఏళ్ల యువ సంచలనం, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ భారత జట్టులోకి అరంగేట్రం చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఒకవేళ వైభవ్ ఆదివారం జరిగే మ్యాచ్లో బరిలోకి దిగితే, 16 ఏళ్ల వయసులో అరంగేట్రం చేసిన క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ రికార్డును అతను బద్దలు కొట్టే అవకాశం ఉంది.
అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరపున ఆడుతున్న అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా వైభవ్ చరిత్ర సృష్టించే అవకాశం ఉండటంతో, ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రపంచం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోంది.
