పంజాబ్ రాష్ట్రంలోని గుర్దాస్పూర్ సమీపంలో, తన మనవడి వయసుకు సమానమైన ఓ చిన్నారిపై 80 ఏళ్ల వృద్ధుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది.
దీనానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో 8 ఏళ్ల బాలుడు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో, బిషన్ సింగ్ అనే 80 ఏళ్ల వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం అతడు బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ సమయంలో బాలుడి తల్లి అకస్మాత్తుగా ఇంటికి రావడంతో, ఆమెను గమనించిన బిషన్ సింగ్ అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. వెళ్లే క్రమంలో బాలుడిని, అతని తల్లిని తోసివేసి అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం.
ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు వెంటనే దీనానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ప్రాథమిక విచారణలో ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు లభించడంతో, బిషన్ సింగ్పై పోక్సో (POCSO) చట్టంతో పాటు ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న అతడిని పోలీసులు గాలిస్తున్నారు.
ఈ ఘటన సోషల్ మీడియాలో కూడా తీవ్ర చర్చకు దారితీసింది. చిన్నారులపై జరుగుతున్న నేరాలపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
