నడవడానికి కూడా రావడం లేదు..! “ఆహారం డెలివరీ చేయడానికి వచ్చిన ఉద్యోగి”. కంగారుపడి ఏమైందని అడిగిన మహిళ. ఆకలితో పిల్లలు చనిపోతారని చెప్పిన తండ్రి మాటలు. కంటనీరు పెట్టించిన సంఘటన..!!

జీవిత పరిస్థితులు మనిషిని ఏ హద్దులకైనా నెట్టివేస్తాయనడానికి మలేషియాలో జరిగిన ఒక సంఘటన కంటనీరు తెప్పించింది.

సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వార్త, ఆహారం డెలివరీ చేయడానికి వచ్చిన ఒక పేద తండ్రి వేదనను వెలుగులోకి తెచ్చింది. ఆకలితో ఉన్న వినియోగదారుడికి ఆహారాన్ని అందించడానికి వచ్చిన ఆ వ్యక్తి, తన శరీర బాధను లెక్కచేయకుండా కష్టపడిన తీరు అందరినీ కదలిపోయేలా చేసింది.

మలేషియాకు చెందిన ‘హావోయి ఇయో’ అనే మహిళ తన ఫేస్‌బుక్ పేజీలో ఈ భావోద్వేగ అనుభవాన్ని పంచుకున్నారు. ఆమె ఆన్‌లైన్ యాప్ ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేయగా, చెప్పిన సమయానికి ఆహారం చేరుకుంది. ఆహారాన్ని తీసుకోవడానికి బయటకు వెళ్లిన హావోయి, డెలివరీ చేయడానికి వచ్చిన వ్యక్తి తీవ్రమైన నొప్పితో కుంటుకుంటూ నడవటం చూసి దిగ్భ్రాంతి చెందారు. ఆయన కాలు విరిగిపోయిందేమోనని భయపడి, వెంటనే ఆ ఉద్యోగిని ఏమైందని విచారించారు.

అప్పుడు ఆ వ్యక్తి, ఆ రోజు మధ్యాహ్నం వర్షం పడుతున్నప్పుడు ఒక మలుపు వద్ద కారు తన మోటార్ బైక్‌ను ఢీకొట్టిందని, అందులో తన కాలుకి తీవ్ర గాయమైందని చాలా ప్రశాంతంగా చెప్పారు. “ఈ కాలుతో మీరు వెంటనే ఆసుపత్రికి కదా వెళ్లాల్సింది? ఎలా మీరు వాహనం నడపగలుగుతున్నారు? మీ పరిస్థితిని మీ భార్య చూస్తే ఎంత ఆందోళన చెందుతుంది?” అని ఆ మహిళ ఆప్యాయంగా అడిగారు.

దీనికి ఆ డెలివరీ ఉద్యోగి చెప్పిన సమాధానం విని ఆ మహిళ హృదయం ముక్కలైపోయింది. “నా భార్యతో విడాకులు అయ్యాయి, ఆమె పిల్లలను నా దగ్గరే వదిలేసి వెళ్లిపోయింది. నేను ఈ సమయంలో విశ్రాంతి తీసుకోవడానికి వెళ్తే, నా పసిపాపలు ఆకలితో చనిపోతారు. అందుకే నాకు ఎంత నొప్పగా ఉన్నా పర్వాలేదు, నేను పని చేసి తీరాల్సిందే” అని చెప్పారు. ఈ మాటలు విని కంటనీరు పెట్టుకున్న ఆ మహిళ, ఆయనకు వెంటనే కావలసినంత డబ్బును సహాయంగా అందించి, ఆ తండ్రి శ్రమకు శిరస్సు వంచారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *