చిత్రసీమ తారలకు, క్రీడాకారులకు మధ్య ప్రేమ పుకార్లు వ్యాపించడం కొత్తేమీ కాకపోయినప్పటికీ, ఇటీవల బాలీవుడ్ మరియు దక్షినాది సినిమాల్లో అగ్ర నటిగా అలరిస్తున్న మృణాళ్ ఠాకూర్, అలాగే భారత క్రికెట్ జట్టు యువ సంచలనం యశస్వి జైస్వాల్ను ముడిపెడుతూ వ్యాప్తి చేసిన పుకారు ఇంటర్నెట్లో పెను తుఫాను రేపింది.
ముంబై బాంద్రాలోని ఒక ప్రముఖ రెస్టారెంట్ నుండి ఇద్దరూ వేర్వేరుగా బయటకు వస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత, వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందనే పుకార్లు వేగంగా షికారు చేయడం ప్రారంభించాయి.
ఈ పుకార్లు హద్దులు దాటడంతో, నటి మృణాళ్ ఠాకూర్ దీనికి నేరుగానే చెక్ పెట్టారు. పుకారును వ్యాప్తి చేసిన సోషల్ మీడియా పోస్ట్ కామెంట్ సెక్షన్లో నేరుగా స్పందించిన ఆమె, “కాస్త శాంతించండి సోదరా! మేమిద్దరం ఎక్కడ కలిసి ఉన్నాం? చదువుకున్న మీరందరూ ఇటువంటి వ్యర్థమైన పుకార్లను నిజమని ఎలా నమ్మడం ప్రారంభిస్తారో అర్థం కావడం లేదు.
దేశంలో మాట్లాడటానికి ఎన్నో ముఖ్యమైన విషయాలు జరుగుతున్నాయి. జెన్ జీ (Gen Z) తరం నుండి నేర్చుకుని సరైన విషయాలపై వీడియోలు చేయండి, అది మీకు మరింత ఎక్కువ వ్యూస్ తెచ్చిపెడుతుంది” అని ఘాటుగా ప్రశ్నించారు.
గతంలో నటుడు ధనుష్తో ముడిపెట్టి వచ్చిన పుకార్లకు కూడా చెక్ పెట్టిన మృణాళ్ ఠాకూర్, ఇప్పుడు మళ్లీ ఒక ఆధారాల్లేని ప్రచారానికి తనదైన శైలిలో తగిన సమాధానం ఇచ్చారు.
ప్రముఖులు బహిరంగ ప్రదేశాల్లో కనిపించినంత మాత్రాన, వారి వ్యక్తిగత జీవితాల గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడాన్ని మీడియా, అభిమానులు నివారించాలని ఈ సంఘటన మరోసారి గుర్తుచేసింది.

Leave a Reply