కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి, ‘కేజీఎఫ్’ (KGF) చిత్రాల అఖండ విజయంతో యావత్ భారతదేశం గర్వించే పాన్-ఇండియా సూపర్ స్టార్గా ఎదిగారు రాకింగ్ స్టార్ యష్.
ఆయన నటించిన కేజీఎఫ్ రెండు భాగాలు బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1,000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డులను సృష్టించాయి. ఈ భారీ విజయంతో ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికుల దృష్టి యష్పై పడింది.
కేజీఎఫ్ తర్వాత యష్ ప్రస్తుతం ‘టాక్సిక్’ (Toxic) చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు, బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రం ‘రామాయణ’లో లంకేశ్వరుడు రావణాసురుడి పాత్రను పోషిస్తూ, ఈ ప్రాజెక్ట్లో సహ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో, రామాయణ సినిమా కోసం రూ.4,000 కోట్ల బడ్జెట్ పెడుతున్నారంటూ వస్తున్న వార్తలపై యష్ స్పందించి అసలు నిజాన్ని వెల్లడించారు. “రూ.4,000 కోట్లు అనేది కేవలం మొదటి భాగానికి మాత్రమే పెడుతున్న ఖర్చు కాదు. రెండు భాగాల మేకింగ్, వీఎఫ్ఎక్స్, ప్రమోషన్లు మరియు ప్రపంచవ్యాప్త రిలీజ్ ఖర్చులతో కలిపిన హాలీవుడ్ తరహా అంచనా ఇది. భారతీయ సినిమా స్థాయిని గ్లోబల్ మార్కెట్లో నిలబెట్టడానికి ఇలాంటి భారీ బడ్జెట్ తప్పనిసరి” అని యష్ స్పష్టం చేశారు.
