బెంగళూరులోని ప్రసిద్ధ కబ్బన్ పార్క్ ప్రాంతంలో ఆదివారం రోజున పర్యాటకులు, ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడిన సమయంలో, ఇద్దరు యువతులు నడురోడ్డుపై ఒకరినొకరు తీవ్రంగా కొట్టుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది.
వారాంతపు సెలవు దినం కావడంతో ఎప్పట్లాగే చాలామంది కబ్బన్ పార్క్కు తరలివచ్చారు. ఆ జనసందోహం మధ్యలో అకస్మాత్తుగా ఇద్దరు యువతులు గొడవపడటమే కాకుండా, రోడ్డుపైనే ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం ప్రారంభించారు. ఈ గొడవను అక్కడ ఉన్నవారు తమ మొబైల్ ఫోన్లలో వీడియోగా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో వేగంగా వైరల్ అవుతూ ఎందరినో ఆకర్షిస్తోంది.
ఆ ఇద్దరు యువతుల మధ్య అకస్మాత్తుగా ఈ ఘర్షణ చెలారడానికి అసలు కారణం ఏమిటనే సమాచారం ఇంకా బయటకు రాలేదు. దీనిపై పోలీసులు లేదా అధికారిక వర్గాల నుంచి మరిన్ని వివరాలు రావాల్సి ఉంది.
