“నా పన్నుల డబ్బుతోనే కదరా జీతాలు తీసుకుంటున్నారు?” ఎఫ్ఐఆర్ నమోదుకు నిరాకరించిన పోలీసులు.. పోలీస్ స్టేషన్‌లోనే కడిగిపారేసిన కారు యజమాని.. మహారాష్ట్రలో కలకలం.!

మహారాష్ట్రలో ఒక వ్యక్తి కారును స్కూటర్ నడుపుతున్న వ్యక్తి ఢీకొట్టి నష్టం కలిగించాడు. బాధితుడు పోలీసులకు ఫోన్ చేసినప్పటికీ ఎవరూ రాకపోవడంతో, కారును రిపేర్ చేయిస్తానని చెప్పి స్కూటర్ నడిపిన వ్యక్తి అతనిని గ్యారేజీకి తీసుకెళ్లాడు.

అయితే అక్కడికి చేరుకున్న తర్వాత ఆ స్కూటర్ నడిపిన వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కారు యజమాని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయాలని కోరాడు.

పోలీసులు సరైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరిస్తూ, ఇన్సూరెన్స్ క్లెయిమ్ ద్వారా నష్టపరిహారం పొందవచ్చని చెబుతూ నిర్లక్ష్యంగా కాలయాపన చేశారు. తాను మోసపోయానని గ్రహించిన కారు యజమాని, తనకు న్యాయం జరగాలంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందేనని పట్టుబట్టాడు. ప్రజల పన్ను డబ్బులతోనే జీతాలు తీసుకుంటున్నారంటూ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

అతని ఆవేదనను గమనించిన ఓ మహిళా కానిస్టేబుల్ వెంటనే ఒక దరఖాస్తు ఫారమ్ ఇచ్చి వివరాలు నమోదు చేయమని కోరింది. దాంతో కాస్త శాంతించిన ఆ వ్యక్తి, పరారైన వారిద్దరినీ వెంటనే పట్టుకుని తన నష్టాన్ని భర్తీ చేయించడంతో పాటు వారిపై జరిమానా కూడా విధించాలని పోలీసులను డిమాండ్ చేశాడు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *