ఛీ.. కన్న తల్లేనా ఈమె.. లేక మృగమా..? ఏడుస్తున్నాడని 2 ఏళ్ల కన్నకొడుకు గొంతు కోసిన కిరాతక తల్లి.. గుండెల్ని పిండేసే దారుణం!

ఫరీదాబాద్ ప్రాంతంలో ముగ్గురు పిల్లల సంరక్షణ భారంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఓ తల్లి, తన రెండేళ్ల కుమారుడి గొంతును కత్తితో కోసిన దారుణ ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

సంఘటన జరిగిన రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో, పిల్లలు ఏదో తప్పు చేశారంటూ ముగ్గురినీ ఆమె తీవ్రంగా కొట్టింది; ఆ సమయంలో ఎంతకీ ఏడుపు ఆపని ఆ చిన్నారి గొంతును కత్తితో కోసి ఈ దారుణానికి ఒడిగట్టింది.

తీవ్రంగా గాయపడిన చిన్నారిని వెంటనే రక్షించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ బాలుడికి వైద్యులు ఐసీయూలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని నిందితురాలైన తల్లిని అరెస్ట్ చేసి లోతైన విచారణ ప్రారంభించారు.

ఎంతటి మానసిక క్షోభ, ఒత్తిడి ఉన్నప్పటికీ.. కన్న తల్లే తన పసికందుపై ఇంతటి పాశవిక దాడికి పాల్పడటం సమాజంలో తీవ్ర విషాదాన్ని, ఆగ్రహాన్ని రేకెత్తించింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *