‘అరువి’, ‘టాటా’ వంటి విజయవంతమైన చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు, బిగ్బాస్ షో ద్వారా విశేష ఆదరణ పొందిన నటుడు ప్రదీప్ ఆంటోనీ.. తన భార్యతో విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
గత 2024లో తన ప్రేయసిని వివాహం చేసుకున్న ప్రదీప్ ఆంటోనీ దంపతులకు, గత ఏప్రిల్ నెలలోనే పండంటి మగబిడ్డ జన్మించాడు. ఈ నేపథ్యంలో, ఆయన తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తీవ్ర భావోద్వేగంతో కూడిన ఒక పోస్ట్ను పంచుకున్నారు. అందులో.. “నేను ఒక తప్పుడు వ్యక్తిని వివాహం చేసుకున్నాను. అందుకే మేమిద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నాం. అయినప్పటికీ నా బిడ్డపై నాకు అపారమైన ప్రేమానురాగాలు ఉన్నాయి” అని పేర్కొన్నారు.
బాబు పుట్టిన కొద్ది నెలలకే వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తి విడాకుల దిశగా నిర్ణయం తీసుకోవడం, వారి అభిమానులతో పాటు చిత్ర పరిశ్రమ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని, విషాదాన్ని నింపింది.

Leave a Reply