అహ్మదాబాద్లోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగులు బాత్రూమ్కు వెళ్లే సమయాన్ని కూడా యాజమాన్యం డేగకన్నుతో పర్యవేక్షిస్తున్న ఒక షాకింగ్ ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
అక్కడ పనిచేసే ఒక ఉద్యోగి తాను టాయిలెట్లో 53 నిమిషాల పాటు ఉన్నందుకు.. కంపెనీ మేనేజర్ తనను పిలిచి వివరణ ఇవ్వాలంటూ తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేశాడని ఓ నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశాడు.
అంతేకాదు, ఆ కంపెనీ నిబంధనల ప్రకారం ఉద్యోగులు రోజుకు గరిష్టంగా 30 నిమిషాలు మాత్రమే టాయిలెట్ బ్రేక్ తీసుకోవడానికి అనుమతి ఉందట. ఈ పరిమితిని దాటి అదనంగా బాత్రూమ్లో గడిపిన సమయాన్ని భర్తీ చేయడం కోసం.. ఆఫీస్ సమయం ముగిసిన తర్వాత మరో 40 నిమిషాల పాటు అదనంగా ఆఫీసులోనే ఉండి పనిచేయాలని మేనేజర్ ఆర్డర్ వేశాడు.
గత 10 నెలలుగా ఆ కంపెనీలో ఎంతో ప్రతిభావంతంగా పనిచేస్తున్నానని, ఇప్పటివరకు తనపై ఎలాంటి ఫిర్యాదు రాలేదని.. కానీ ప్రస్తుత యాజమాన్యం తీసుకున్న ఈ చర్య తనను తీవ్ర మానసిక నరకానికి గురిచేసిందని సదరు ఉద్యోగి ప్రముఖ సోషల్ మీడియా వేదిక ‘రెడిట్’ (Reddit) లో పోస్ట్ చేశాడు.
తాను టాయిలెట్కు వెళ్లేటప్పుడు తన మొబైల్ ఫోన్ను కూడా డెస్క్పైనే వదిలేసి వెళ్తానని, అక్కడ సమయాన్ని వృధా చేయనని ఆయన స్పష్టం చేశాడు. ఆఫీస్ పని నాణ్యతలో ఎలాంటి లోపం లేనప్పటికీ, ఉద్యోగుల ప్రాథమిక అవసరాలను కూడా ఇలా మైక్రో-మేనేజ్మెంట్ (సూక్ష్మంగా పర్యవేక్షించడం) చేస్తూ వేధించడం అత్యంత అన్యాయమంటూ నెటిజన్లు సదరు కంపెనీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply