కేరళకు చెందిన మలయాళ నటి ఐశ్వర్య లక్ష్మి, మోడలింగ్ రంగం నుండి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి, తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళంలో ‘జగమే తందిరం’, ‘పొన్నియిన్ సెల్వన్’ వంటి చిత్రాల్లో నటించిన ఆమె, ప్రస్తుతం ‘కట్టా కుస్తీ 2’ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆమె తన వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకున్నారు.
బిడ్డను కనాలనే కోరిక: పెళ్లి మరియు కుటుంబ వ్యవస్థపై ఐశ్వర్య లక్ష్మి మాట్లాడుతూ, “వివాహ బంధంలో నాకు కొన్ని సందిగ్ధాలు ఉన్నాయి. అయితే, ఒక బిడ్డను కనాలని నాకు ఆశగా ఉంది. నా జీవితంలోకి వచ్చే వ్యక్తి మంచి తండ్రిగా ఉంటాడని, ఎప్పటికీ నన్ను వదిలి వెళ్లడని నేను నమ్మగలిగితే, అతనితో కలిసి బిడ్డను పంచుకోవడానికి నేను సిద్ధం” అని ఆమె వెల్లడించారు. తన కెరీర్ మరియు వ్యక్తిగత జీవితంలో తాను కొన్ని మార్పులు చేసుకుంటున్నానని కూడా ఆమె తెలిపారు.
నెటిజన్ల రియాక్షన్: ఐశ్వర్య లక్ష్మి తన మనసులోని కోరికను ఇలా బయటపెట్టగానే సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. “మేము సిద్ధంగా ఉన్నాం, మీరు ఒకే చెబితే పెళ్లి సంబంధం తీసుకుని వస్తాం” అంటూ ఆమె అభిమానులు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
