ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా కుడుపల్లె మండలానికి చెందిన చిరంజీవి అనే వ్యక్తి 27 ఏళ్ల భార్య శోభకు, గుంటూరు జిల్లాకు చెందిన బాలాజీ నాయక్ అనే వ్యక్తితో రాంగ్ ఫోన్ కాల్ ద్వారా పరిచయం ఏర్పడింది.
కాలక్రమేణా ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం కొనసాగించిన వీరిద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. వీరి వ్యవహారం భర్త చిరంజీవికి తెలియడంతో, ఆయన భార్యను మందలించి కొట్టారు. దీంతో ఆగ్రహం చెందిన ఆ అక్రమ జంట, ప్రారంభంలో భర్తను చంపడానికి ప్లాన్ చేసినప్పటికీ, ఆ తర్వాత ఇల్లు వదిలి పారిపోవాలని నిర్ణయించుకున్నారు.
భర్తను మరియు పిల్లలను వదిలేసి పారిపోయిన శోభ, కుప్పం ప్రాంతంలోని ఒక ఆలయంలో బాలాజీని వివాహం చేసుకుంది. కాగా భార్య కనిపి కనిపించకుండా పోవడంపై చిరంజీవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గాలిస్తుండగా, ఇద్దరినీ కనిపెట్టి పోలీసులకు అప్పగించారు. విచారణలో, తనను పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని శోభ బెదిరించడంతో బలవంతంగా పెళ్లి చేసుకున్నట్లు బాలాజీ చెప్పాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Leave a Reply