“ఇది ఆసుపత్రా లేక సారా దుకాణమా..?” ప్రభుత్వ ఆసుపత్రి వార్డులో కూర్చుని మద్యం తాగిన మహిళ.. ఐసీయూలో కుమారుడు.. షాకింగ్ వీడియో వైరల్..!!

మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్‌పూర్ జిల్లాలోని విక్టోరియా ప్రభుత్వ ఆసుపత్రిలో, ఒక మహిళ వార్డులో కూర్చుని మద్యం తాగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయి తీవ్ర వివాదానికి దారితీసింది.

ఆసుపత్రి భద్రత, పర్యవేక్షణ వ్యవస్థలపై ప్రశ్నలు లేవనెత్తుతున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

జబల్‌పూర్ జిల్లా ఆసుపత్రికి చెందినదిగా చెబుతున్న ఈ వైరల్ వీడియోలో, ఆ మహిళ ఆసుపత్రి వార్డు నేలపై కూర్చుని నేరుగా సీసా నుంచే మద్యం తాగుతున్న దృశ్యాలు నమోదయ్యాయి. సమాచారం ప్రకారం, ఆమె కుమారుడు అదే ఆసుపత్రిలోని ఆర్థోపెడిక్ వార్డులో చికిత్స పొందుతున్నాడు. అయితే ఆమె పక్కనున్న మరో వార్డులోకి వెళ్లి ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

సెక్యూరిటీ సిబ్బంది, ఆసుపత్రి ఉద్యోగుల కళ్లుగప్పి వార్డులోకి మద్యం బాటిల్‌ ఎలా వచ్చింది? అక్కడ పర్యవేక్షణ ఏమైంది? అనే తీవ్రమైన ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై ఆసుపత్రి యాజమాన్యం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక వివరణ రాలేదు.

ఇటువంటి ఘటనే గతంలో మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోనూ జరిగింది. అక్కడ ఒక రోగి వార్డులోని బెడ్ కింద కూర్చుని మద్యం తాగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇలాంటి వరుస ఘటనలు ప్రభుత్వ ఆసుపత్రుల భద్రతా ఏర్పాట్లపై ప్రజల్లో తీవ్ర విమర్శలకు తావిస్తున్నాయి.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *