ఇరాన్ యుద్ధనౌక IRIS Dena: అందరూ బతికేవారు! భారత్ మాట విని ఉంటే అమెరికా ఈ నౌకను ముంచేసేది కాదు

హిందూ మహాసముద్రంలో ఇరాన్ ఫ్రిగేట్ IRIS Dena నేడు సురక్షితంగా ఉండేది, అందులోని నావికులందరూ ప్రాణాలతో ఉండేవారు. కానీ, భారత్ ఇచ్చిన ఒక చిన్న సలహాను ఇరాన్ పాటించి ఉంటే అమెరికా టార్పెడో దాడి నుండి ఈ నౌక తప్పించుకునేది. అమెరికా సబ్ మెరైన్ దాడికి ముందే, యుద్ధ వాతావరణం దృష్ట్యా తమ ఓడరేవులో ఆశ్రయం పొందాలని భారత్ ఇరాన్‌కు ఆఫర్ ఇచ్చింది. “ప్రస్తుతం పరిస్థితులు బాగోలేవు, ఇప్పుడే వెళ్లడం సరికాదు” అని భారత్ హెచ్చరించింది. కానీ దురదృష్టవశాత్తూ, తన దేశానికి తిరిగి వెళ్తున్న సమయంలో శ్రీలంక సమీపంలో అమెరికా సబ్ మెరైన్ ఈ నౌకను ముంచేసింది.

అసలు ఏం జరిగింది?
ఫిబ్రవరి 25న విశాఖపట్నంలో ముగిసిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (IFR) – MILAN 2026 ఎక్సర్‌సైజ్‌లో పాల్గొన్న తర్వాత IRIS Dena తిరుగు ప్రయాణమైంది. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిగి, ఖమేనీ మరణించినట్లు వార్తలు రావడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ క్రమంలో మార్చి 4 తెల్లవారుజామున శ్రీలంకలోని గాలేకు 20 నాటికల్ మైళ్ల దూరంలో అమెరికా టార్పెడోలతో దాడి చేసి ఈ నౌకను ముంచేసింది.

భారత్ ఆశ్రయంలో మరో ఇరాన్ నౌక
IRIS Dena మునిగిపోయిన రోజే (మార్చి 4), మరో ఇరాన్ యుద్ధనౌక IRIS Lavan సురక్షితంగా కొచ్చి ఓడరేవుకు చేరుకుంది.

సాంకేతిక సమస్య: ఫిబ్రవరి 28న ఈ నౌకలో సాంకేతిక లోపం తలెత్తడంతో భారత్‌ను ఆశ్రయం కోరింది.

భారత్ అంగీకారం: మానవతా దృక్పథంతో మార్చి 1న భారత్ అనుమతినివ్వగా, మార్చి 4న ఇది కొచ్చికి చేరుకుంది.

రక్షణ: ప్రస్తుతం ఈ నౌకలోని 183 మంది సిబ్బందికి కొచ్చిలోని నావికాదళ కేంద్రంలో వసతి కల్పించారు.

సహాయక చర్యలు (Search & Rescue)
IRIS Dena నుండి డిస్ట్రెస్ కాల్ అందగానే శ్రీలంక మరియు భారత నావికాదళాలు రంగంలోకి దిగాయి.

శ్రీలంక నేవీ: మునిగిపోయిన నౌక నుండి 32 మందిని రక్షించింది. సుమారు 180 మంది సిబ్బందిలో 87 మంది మరణించగా, మరో 60 మంది ఆచూకీ ఇంకా లభించలేదు.

భారత నేవీ: కొచ్చి నుండి INS Ikshak నౌకను గాలింపు చర్యల కోసం పంపింది. గాల్లో నుండి లైఫ్ రాఫ్ట్‌లను జారవిడిచేందుకు విమానాలను కూడా సిద్ధంగా ఉంచింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *