నాలుగు తరాలుగా వేలాది మంది విద్యార్థుల ఆకలిని తీర్చిన ప్రసిద్ధ ‘పూర్ణానంద్’ క్యాంటీన్ వడాపావ్, ప్రస్తుతం తన సుదీర్ఘ ప్రయాణాన్ని ముగించాల్సిన అనివార్య పరిస్థితికి చేరుకుంది.
తరతరాలుగా అదే రుచితో, చెక్కుచెదరని ఆప్యాయతతో అందించబడుతున్న ఈ సంప్రదాయ వడాపావ్ ఇకపై విద్యార్థులకు, రెగ్యులర్ కస్టమర్లకు దొరకదన్న వార్త ఆ ప్రాంతమంతటా తీవ్ర నిరాశను, ఆవేదనను నింపింది.
కేవలం ఒక సాధారణ తినుబండారంగా మాత్రమే కాకుండా, ఎన్నో తరాల విద్యార్థుల కళాశాల జ్ఞాపకాలతో ముడిపడిపోయిన ఒక భావోద్వేగంగా ఈ వడాపావ్ నిలిచింది. ఇలాంటి పరిస్థితుల్లో ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (FDA) జారీ చేసిన కొత్త ఆదేశాలు ఈ చారిత్రక క్యాంటీన్పై పిడుగులా పడ్డాయి.
క్యాంటీన్లలో వడాపావ్ వంటి డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అమ్మకాన్ని వెంటనే నిలిపివేసి, వాటి స్థానంలో ఇడ్లీ, ఢోక్లా వంటి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను మాత్రమే విక్రయించాలని అధికారులు కఠిన ఆదేశాలు జారీ చేశారు.
అధికారుల ఈ ఏకపక్ష నిర్ణయం ఆ క్యాంటీన్ గుర్తింపునే దెబ్బతీసేలా ఉందని యజమానితో పాటు తరతరాలుగా వస్తున్న కస్టమర్లు తీవ్ర మనోవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాలక్రమంలో ఎన్నెన్నో ఆధునిక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు వచ్చినప్పటికీ, పూర్ణానంద్ వడాపావ్కున్న మజా, ఆధరణ ఇసుమంతైనా తగ్గలేదు. నాలుగు తరాల మధుర జ్ఞాపకాలను, అసలైన రుచిని మోసుకొచ్చిన ఒక ఆహారాన్ని అధికారుల ఒకే ఒక్క ఆర్డర్తో బలవంతంగా ఆపివేయడం ఏమాత్రం న్యాయం కాదన్నది స్థానికుల ఆక్రోశం.
అధికారుల నిబంధనలకు తలొగ్గి ఇడ్లీ, ఢోక్లాలకు మారినప్పటికీ.. పూర్ణానంద్ వడాపావ్ ప్రత్యేకమైన రుచిని ఇకపై ఎప్పటికీ ఆస్వాదించలేమన్న బాధ దాని అభిమానుల గుండెల్లో ఎప్పటికీ ఒక తీరని వెలితిగానే మిగిలిపోనుంది.

Leave a Reply