ఫరీదాబాద్లో తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన ప్రియుడిని హత్య చేసిన నేరానికి గాను 33 ఏళ్ల అనిత అనే మహిళను అరెస్టు చేశారు.
మధ్యప్రదేశ్కు చెందిన అనిత పారిశుధ్య కార్మికురాలిగా, ఉత్తరప్రదేశ్కు చెందిన సదాకత్ అనే పెయింటింగ్ కార్మికుడిగా పనిచేసేవారు. వీరిద్దరికీ పెళ్లిళ్లయినప్పటికీ, అనితను ఆమె భర్త వదిలేయడంతో వీరిద్దరూ పరిచయంలో ఉన్నారు.
అనిత వరుసగా పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసినప్పటికీ సదాకత్ దానిని వాయిదా వేస్తూ వచ్చాడు. దీంతో ఆగ్రహించిన అనిత, జూలై 25న సదాకత్ను తన గదికి పిలిపించి మద్యం తాగించింది. ఆ తర్వాత అర్ధరాత్రి అతను మత్తులో నిద్రపోతున్నప్పుడు, కత్తితో అతని గొంతు కోసి హత్య చేసి, ఇంటికి బయట తాళం వేసి పరారైంది.
సదాకత్ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సూరజ్కుండ్ పోలీసులు, ఆనంగ్పూర్ గ్రామంలోని ఒక అద్దె ఇంట్లో నుండి సదాకత్ కుళ్ళిపోయిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనితపై అనుమానం రావడంతో ఆమెను శుక్రవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో అనిత తన నేరాన్ని అంగీకరించగా, ఆమెను కోర్టులో హాజరుపరిచి రెండు రోజుల పోలీస్ కస్టడీకి తరలించారు.

Leave a Reply