కాన్పూర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ దేహాత్ జిల్లా మంగళ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్కురా గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. జ్యోతి అనే యువతిని ఆమె వదిన మరియు బావ (భర్త తమ్ముడు) కలిసి అత్యంత క్రూరంగా హత్య చేశారు.
జూన్ 5వ తేదీన ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. జ్యోతి తన ఇంట్లోనే తన వదిన మరియు బావ అక్రమ సంబంధంలో ఉండగా, అసభ్యకర స్థితిలో ఉన్న వారిని కళ్లారా చూసింది. తమ అక్రమ సంబంధం విషయం కుటుంబ సభ్యులకు, సమాజానికి తెలిసిపోతుందనే భయంతో.. వారిద్దరూ కలిసి జ్యోతిని అడ్డుతొలగించుకోవాలని పథకం రచించారు.
ఈ పథకం ప్రకారం, వారు జ్యోతిపై విచక్షణా రహితంగా దాడి చేసి హత్య చేశారు. అనంతరం ఆధారాలను కప్పిపుచ్చేందుకు ఆమె మృతదేహాన్ని సమీపంలోని నదిలో పడేశారు. జూన్ 8వ తేదీన నదిలో జ్యోతి మృతదేహం లభ్యం కావడంతో ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ హత్యలో మృతురాలి కుటుంబానికి చెందిన మరికొందరి ప్రమేయం కూడా ఉన్నట్లు తేలింది.
విషయం వెలుగులోకి రావడంతో నిందితులందరూ పరారయ్యారు. వీరిలో ప్రధాన నిందితురాలైన వదినను రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

Leave a Reply