చెన్నై కుండ్రత్తూరు సమీపంలోని పూందండలం ప్రాంతంలో మహేష్ (27) అనే ఆటో డ్రైవర్ దారుణ హత్యకు గురికావడం తీవ్ర కలకలం రేపింది.
ఆటో నడుపుకుంటూ జీవించే మహేష్, తన స్నేహితులైన హరికృష్ణన్ (27), వెంకటేశన్ (21), లలిత్కుమార్ (21)లతో కలిసి పూందండలంలో మద్యం సేవించినట్లు తెలిసింది. ఆ సమయంలో వీరి మధ్య ఉన్న పాత కక్షల నేపథ్యంలో హఠాత్తుగా తీవ్ర వాగ్వాదం మొదలైంది.
గొడవ ముదరడంతో ఆగ్రహానికి గురైన ఆ ముగ్గురు స్నేహితులు, తాము వెంట తెచ్చుకున్న కొడవళ్లతో మహేష్పై విచక్షణారహితంగా దాడి చేసి నరికారు. అంతటితో ఆగకుండా అతడు తీవ్ర గాయాలతో కిందపడిపోగానే, తలపై పెద్ద బండరాయిని వేసి అక్కడికక్కడే ప్రాణాలు తీశారు.
తీవ్ర రక్తస్రావంతో మహేష్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న కుండ్రత్తూరు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం హత్య చేసి పరారయ్యేందుకు యత్నించిన హరికృష్ణన్, వెంకటేశన్, లలిత్కుమార్లను పోలీసులు వేగంగా స్పందించి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Leave a Reply