పుణే: “అర్ధరాత్రి సమయంలో మొబైల్కు వచ్చిన ఆ ఒక్క మెసేజ్ చూసి.. ఉదయాన్నే బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకునే సరికి ఖాతాలో ఉన్న సొమ్మంతా మాయమైపోయింది!” అని ఒక బాధితుడు వాపోయేలా.. గుర్తుతెలియని నంబర్ నుండి వచ్చిన పెళ్లి పత్రిక లింక్ను నమ్మి ఓపెన్ చేసిన పుణేకు చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త, లక్షల రూపాయలు నష్టపోయిన దిగ్భ్రాంతికర ఘటన ఇప్పుడు తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
పుణే నగర ప్రాంతంలో నివసిస్తున్న 56 ఏళ్ల ఓ ప్రముఖ పారిశ్రామికవేత్తకు గత నెలలో గుర్తుతెలియని నంబర్ నుండి ఒక ‘డిజిటల్ వెడ్డింగ్ ఇన్విటేషన్’ (పెళ్లి పత్రిక) లింక్ వచ్చింది. దాన్ని ఆయన సాధారణ మెసేజ్ అనుకుని క్లిక్ చేశారు. కట్ చేస్తే.. మరుసటి రోజు అర్ధరాత్రి ఆయన మొబైల్కు లావాదేవీలకు సంబంధించిన కొన్ని సందేశాలు (Transaction Alerts), వాటి వెనుకే ఓటీపీ (OTP) నంబర్లు వచ్చాయి.
ఆ తర్వాత కొద్ది నిమిషాల వ్యవధిలోనే, ఆయన బ్యాంక్ ఖాతా నుండి ఏకంగా రూ. 5 లక్షల 30 వేలు ఆన్లైన్ ద్వారా డ్రా అయి, వేరే ఖాతాకు బదిలీ అయినట్లు వచ్చిన మెసేజ్ చూసి ఆయన ఒక్కసారిగా దిత్తీలిపోయారు.
ఈ ఘటనపై బాధితుడైన వ్యాపారవేత్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలను హెచ్చరిస్తూ.. “సార్వజనికులు ఎవరూ కూడా గుర్తుతెలియని నంబర్ల నుండి వచ్చే అనుమానాస్పద లింకులు లేదా ఏపికే (.apk) ఫైళ్లను పొరపాటున కూడా ఓపెన్ చేయవద్దు. అలాగే మీ వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలను, ఓటీపీ నంబర్లను ఎవరితోనూ పంచుకోవద్దు” అని స్పష్టం చేశారు.

Leave a Reply