జార్ఖండ్: రైలులో ప్రయాణిస్తున్న ఒక దివ్యాంగ మహిళపై మద్యం మత్తులో ఉన్న పెంట్రీ కార్ సిబ్బంది ఒకరు అత్యాచారానికి ప్రయత్నించిన దారుణ ఘటన వెలుగుచూసింది. బాధితురాలు ఒడిశా నుండి ఉత్తరప్రదేశ్కు ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ఏం జరిగింది?
అర్ధరాత్రి 2 నుండి 3 గంటల మధ్య, సదరు మహిళ బాత్రూమ్కు వెళ్లగా, అదే రైలులో పనిచేసే పెంట్రీ కార్ సిబ్బంది ‘రామ్జీత్’ ఆమెను అనుసరించి లోపలికి చొరబడ్డాడు. అక్కడ ఆమెపై అత్యాచారానికి, అప్రాకృతిక లైంగిక దాడికి ప్రయత్నించాడు.
ప్రయాణికుల ధైర్యం..
బాత్రూమ్ నుండి వస్తున్న అరుపులను గమనించిన ఇద్దరు తోటి ప్రయాణికులు వెంటనే స్పందించి, తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. నిందితుడి బారి నుండి మహిళను కాపాడారు. రైలు స్టేషన్కు చేరుకోగానే, ప్రయాణికులు అందించిన సమాచారం మేరకు రైల్వే పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైళ్లలో మహిళల భద్రతపై మరోసారి ఈ ఘటన తీవ్ర చర్చకు దారితీసింది.
