సోషల్ మీడియా: సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్ కోసం ప్రజలు తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదకరమైన విన్యాసాలు చేయడం ప్రస్తుతం ఒక ఫ్యాషన్గా మారింది. తాజాగా అటువంటి ఒక భయంకరమైన వీడియో ఇంటర్నెట్లో వేగంగా వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో, ఒక యువతి అతి వేగంగా ప్రవహిస్తున్న జలపాతం అంచున బోర్లా పడుకుని ఉంది. మొదట ఇది సాధారణంగానే కనిపించినా, కెమెరా కోణం మారి డ్రోన్ షాట్ ద్వారా చూపిస్తున్నప్పుడు మాత్రం చూసేవారి గుండె ఆగిపోయినంత పనవుతుంది. ఎందుకంటే, ఆ యువతి పడుకున్న ప్రదేశానికి అతి దగ్గరలోనే వందల అడుగుల లోతైన మరణం లాంటి లోయ ఉంది.
ఆఫ్రికా ఖండంలోని జాంబియా దేశంలో ఉన్న ఒక జలపాతం వద్ద ఈ సాహసం జరిగింది. అక్కడ నీటి ప్రవాహం ఎంత వేగంగా ఉందంటే, చూస్తేనే కాళ్లు వణకాల్సిందే. కాస్త అడుగు తడబడినా, వందల అడుగుల లోతులో పడితే ప్రాణాలతో బయటపడటం దాదాపు అసాధ్యం. అయినా కూడా, ఆ యువతి ముఖంలో ఏమాత్రం భయం లేకుండా, ఎంతో ధైర్యంగా ఆ అంచున పడుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ వీడియో చూసి నెటిజన్లు షాక్కు గురవుతున్నారు.
ఈ వీడియోలో ఉన్న యువతి ఎవరో సాధారణ వ్యక్తి కాదు.. ఆమె ఇరాన్కు చెందిన ప్రసిద్ధ అథ్లెట్ రాజియా జాన్బాజ్. ఇరాన్ తరపున మొదటి మహిళా హ్యాండ్బాల్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన ఆమె, క్రీడల నుండి రిటైర్ అయిన తర్వాత ప్రస్తుతం అడ్వెంచర్ ప్రియురాలిగా మరియు కంటెంట్ క్రియేటర్గా మారుతున్నారు. ఇన్స్టాగ్రామ్లో 3 లక్షల 70 వేలకు పైగా ఫాలోవర్లను కలిగి ఉన్న ఆమె, తన ప్రయాణాలకు మరియు ఫిట్నెస్కు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తుంటారు. అయితే, తాజాగా ఆమె చేసిన ఈ ప్రమాదకరమైన జలపాత సాహసం నెటిజన్లను విస్మయానికి గురిచేస్తోంది.
