వందే భారత్ రైళ్లలో ఆటోమేటిక్ డోర్లు (Automatic Doors) ఉంటాయి. రైలు బయలుదేరడానికి కొద్ది నిమిషాల ముందే ఈ తలుపులు వాటంతట అవే మూసుకుపోతాయి. దీనివల్ల చివరి నిమిషంలో వచ్చే ప్రయాణీకులు రైలును మిస్ అవుతుంటారు. అయితే, ఇలా ఆలస్యంగా వచ్చే ప్రయాణీకులు అత్యవసర పరిస్థితుల్లో రైలు చివరలో ఉండే సిబ్బంది (Crew) కోచ్ ద్వారా ఎక్కవచ్చని భారతీయ రైల్వే తెలిపింది. రైల్వే సిబ్బంది అనుమతి మరియు సహాయంతో ప్రయాణీకులు రైలు ఎక్కే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
రైలు ఎక్కడం ఎలా? రైలు బయలుదేరిన తర్వాత తలుపులు మూసుకున్నా, రైలు చివరలో ఉండే గార్డు కోచ్ (Guard Coach) తలుపు తెరిచే ఉంటుంది. ప్రయాణీకులు ఈ కోచ్ ద్వారా లోపలికి వెళ్లి, తమ సీటు వద్దకు చేరుకోవచ్చు. ఒకవేళ మీరు రైలు నుండి దిగిపోయినా లేదా లోపలికి వెళ్లిన తర్వాత తలుపులు మూసుకున్నా, వెంటనే రైలు చివర ఉండే గార్డు కోచ్ వైపు వెళ్లి, ఆ తలుపు ద్వారా ఎక్కవచ్చు లేదా దిగవచ్చు.
ప్రయాణీకులు గమనించాల్సిన నియమాలు:
- చైన్ లాగకండి: మీరు దిగాల్సిన స్టేషన్ను దాటిపోయినట్లయితే, వెంటనే ఎమర్జెన్సీ చైన్ (Emergency Chain) లాగవద్దని రైల్వే అధికారులు సూచించారు. అలా చేసే బదులు, టికెట్ ఎగ్జామినర్ (TTE)ను సంప్రదించి పరిస్థితిని వివరించాలి. తదుపరి స్టేషన్లో దిగడానికి వారు మీకు అనుమతిస్తారు.
- ఆటోమేటిక్ డోర్లు: రైలు బయలుదేరడానికి కొన్ని సెకన్ల ముందే అన్ని తలుపులు ఆటోమేటిక్గా మూసుకుపోతాయి. ఈ నియంత్రణ పూర్తిగా లోకో పైలట్ వద్దే ఉంటుంది. కాబట్టి, తలుపులు మూసుకున్న తర్వాత వాటిని బలవంతంగా తెరవడానికి ప్రయత్నించకండి.
- అత్యవసర పరిస్థితి: రైలు ఎమర్జెన్సీ చైన్ను అత్యంత అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించాలని అధికారులు హెచ్చరించారు.
వందే భారత్ రైళ్లు పూర్తిగా ఎయిర్ కండిషన్ సౌకర్యం, ఆధునిక ఇంటీరియర్స్, బయో-టాయిలెట్లు వంటి అత్యాధునిక వసతులతో ఉంటాయి. ప్రయాణీకులు సురక్షితమైన ప్రయాణం కోసం ఈ నిబంధనలను పాటించాలని కోరుతున్నారు.
