“వీళ్లు అసలు మనుషులేనా?”.. గర్భిణిని చంపి బిర్యానీ పాత్రలోకి రక్తాన్ని ఒంపిన ఘోరం.. గూడువాంచేరిలో వెన్నులో వణుకు పుట్టించే దారుణం..!!!

చెన్నై సమీపంలోని గూడువాంచేరి ప్రాంతంలో గర్భిణిగా ఉన్న ఓ మహిళ దారుణ హత్యకు గురై, ఆమె శరీర భాగాలను సూట్‌కేసులో కుక్కి ఆగ్రాకు పంపించిన ఘటన మొత్తం తమిళనాడును తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

తమను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినందుకు ఆగ్రహించిన ఒడిశాకు చెందిన మాణిక్ ఉద్దీన్ లస్కర్, భగపతి మాఝీ అనే దంపతులు ఈ దారుణానికి పాల్పడ్డారు. బాధితురాలు నిద్రిస్తున్న సమయంలో ఆమె ముఖంపై మత్తుమందు చల్లి, ఆ తర్వాత గొంతు కోసి ఈ హత్యకు ఒడిగట్టారు.

హత్య అనంతరం నిందితులు చేసిన పనులు మానవజాతికే సిగ్గుచేటు కలిగించేంత కిరాతకంగా ఉన్నాయి. బాధితురాలి శరీరంలోని రక్తాన్నంతటినీ ఒక బిర్యానీ పాత్రలోకి కార్చి, మృతదేహాన్ని ఫ్యాన్‌కు తలకిందులుగా వేలాడదీసి ముక్కలుగా నరికారు. అంతేకాకుండా, ఆ మహిళ తల వెంట్రుకలను పూర్తిగా తొలగించి (గుండు కొట్టి), రెండు కళ్లను వేరు చేసి, శరీర భాగాలను సూట్‌కేసులో కుక్కి ఆగ్రాకు పంపినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

ఈ ఘోరానికి పాల్పడిన మాణిక్ ఉద్దీన్ లస్కర్, భగపతి మాఝీలను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో వారు ఇచ్చిన వాంగ్మూలం బయటకు రావడంతో సోషల్ మీడియాలో, వార్తా మాధ్యమాల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత పాశవికంగా జరిగిన ఈ దారుణ హత్యోదంతంపై పోలీసులు కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *