హర్యానా రాష్ట్రం పంచ్కులలో, రిటైర్డ్ ఆర్మీ కెప్టెన్ మన్మోహన్ లాల్ మెహతా భార్య నీరా మెహతా (72), ఇంట్లో కనిపించకుండా పోయిన నగల గురించి నిలదీసేందుకు పనిమనిషి సునీతా దేవి ఇంటికి వెళ్లారు.
అక్కడ జరిగిన గొడవలో నీరా మెహతా దారుణంగా హత్య చేయబడ్డారు. మృతదేహాన్ని దాచిపెట్టేందుకు పనిమనిషి, ఆమె కుమారుడు కలసి పక్క ఇంటి మిద్దెపైకి (మేడపైకి) మోసుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ (CCTV) కెమెరాలో రికార్డయ్యాయి.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితురాలు సునీతా దేవి, ఆమె భర్త శంకర్ మరియు కుమారుడు రాజా అనే ముగ్గురినీ 24 గంటల్లోనే అరెస్టు చేశారు. అనంతరం జరిపిన విచారణలో, తమను “దొంగలు” అని తరచూ అనుమానించేదనే ఆక్రోశంతోనే ఈ హత్యను ప్లాన్ చేసి చేసినట్లు వారు అంగీకరించారు. అయినప్పటికీ, తాము నగలు దొంగిలించలేదని, నీరా మెహతా పొరపాటున కిందపడిపోయి చనిపోయిందని సునీతా దేవి దావా వేసింది.

Leave a Reply