షాకింగ్ న్యూస్: మద్యం మత్తులో మహిళ తలపై మూత్ర విసర్జన చేసిన టికెట్ టీటీఈ!

మద్యం మత్తులో ప్రయాణిస్తున్న టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ) ఓ మహిళ తలపై మూత్ర విసర్జన చేసిన సంఘటన ఆదివారం అకల్ తఖ్త్ ఎక్స్‌ప్రెస్‌లో జరిగిందని ప్రభుత్వ రైల్వే పోలీసు (జిఆర్‌పి) అధికారి తెలిపారు.

ఆ మహిళ అమృత్‌సర్‌కు చెందిన తన భర్త రాజేష్ కుమార్‌తో కలిసి ప్రయాణిస్తోంది. అమృత్‌సర్‌ నుంచి కోల్‌కతాకు వెళ్తున్న అకల్‌ తఖ్త్‌ ఎక్స్‌ప్రెస్‌లోని ఏ1 కోచ్‌లో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుందని జీఆర్‌పీ అధికారి ఒకరు తెలిపారు.

సోమవారం రైలు లక్నోలోని చార్‌బాగ్ రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే మహిళ కేకలు విని చుట్టుపక్కల ఉన్న ప్రయాణికులు మద్యం మత్తులో ఉన్న టీటీఈని జీఆర్‌పీకి అప్పగించారు.టీటీఈని బీహార్‌కు చెందిన మున్నా కుమార్‌గా గుర్తించి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు


Posted

in

by

Tags: