అయ్యో ఇలా జరగాలా..? డ్యూటీకి వెళ్తున్న వ్యక్తి.. కనురెప్పపాటులో జరిగిన ఘోరం.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు.!!

ముంబై అంధేరి తూర్పు ప్రాంతానికి చెందిన సుశీల్ శర్మ (46) అనే వ్యక్తి, మలాడ్ పరిధిలోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.

ఆయన గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రోజూలాగే తన మోటార్ సైకిల్‌పై విధులకు బయలుదేరాడు. మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో గోరేగావ్ తూర్పులోని వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవే ఆరే ఫ్లైఓవర్‌పై వెళ్తుండగా, ఎడమ వైపు నుంచి వచ్చిన ఒక లారీ ఆయన బైక్‌ను బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో సుశీల్ కిందపడిపోగా, లారీ చక్రాలు ఆయనపై నుంచి దూసుకెళ్లాయి. బాటసారులు, ఓ టెంపో డ్రైవర్ సాయంతో ఆయనను హుటాహుటిన జోగేశ్వరి ట్రామా కేర్ సెంటర్‌కు తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మధ్యాహ్నం 2:15 గంటల సమయంలో ఆయన ప్రాణాలు విడిచారు. ఈ ఘటనపై నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేశారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *