విమాన ప్రయాణంలో వృద్ధ దంపతులు స్టీల్ ప్లేట్లో పరోటా, పెరుగు, ఆవకాయ పెట్టుకుని తింటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో విడుదలై తీవ్ర చర్చకు దారితీసింది.
విమాన ప్రయాణం వంటి బహిరంగ ప్రదేశాల్లోనూ సరైన మర్యాదలు, ప్రయాణ నిబంధనలు పాటించాలని, ఇలా బయటి నుంచి తెచ్చుకున్న ఆహారాన్ని తినడం సరైంది కాదని ఒక వర్గం వాదిస్తోంది.
మరోవైపు, ఇతరులకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ప్రశాంతంగా తమ ఆహారాన్ని మాత్రమే వారు తిన్నారని, ఇందులో తప్పేమీ లేదని ఇంకొక వర్గం ఆ దంపతులకు మద్దతుగా నిలిచింది. విమానాల్లో విక్రయించే ఆహార పదార్థాల ధరలు అధికంగా ఉంటాయని, అందరూ వాటిని కొనుగోలు చేయలేరని, ఇంటి నుంచి సొంత ఆహారాన్ని తెచ్చుకోవడం సమంజసమేనని మద్దతుదారులు అభిప్రాయపడుతున్నారు.
ఈ సాధారణ ఘటన ప్రస్తుతం ఇంటర్నెట్లో హాట్ టాపిక్గా మారి, విమాన ప్రయాణాల్లో వ్యక్తిగత స్వేచ్ఛ ఎక్కడ ముగుస్తుంది, ప్రయాణ సంస్కృతి ఎక్కడ మొదలవుతుంది అనే అంశంపై తీవ్ర చర్చకు తెరలేపింది.

Leave a Reply