ఉత్తరప్రదేశ్లోని నోయిడా సమీపంలో గల హల్దోని గ్రామంలో ఆడుకుంటూ అదృశ్యమైన ఆరేళ్ల బాలిక కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. స్థానిక సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా దారుణ నిజాలు వెలుగులోకి వచ్చాయి.
తిల్పతా గ్రామానికి చెందిన బల్రాజ్ అనే వ్యక్తి ఆ బాలికను తీసుకెళ్లడం, ఆ తర్వాత ఒక గోనెసంచితో పొలాల వైపు వెళ్లడం సీసీటీవీ ఫుటేజీలో రికార్డైంది. దీని ఆధారంగా పోలీసులు సమీప పొలాల్లో గాలించగా, గోనెసంచిలో చిన్నారి మృతదేహం లభ్యమైంది.
అనంతరం పరారీలో ఉన్న బల్రాజ్ను పట్టుకునేందుకు పోలీసులు వెళ్లగా, అతడు పోలీసులపై కాల్పులు జరిపాడు. ఈ దాడిలో హెడ్ కానిస్టేబుల్ రవికుమార్ గాయపడ్డారు. పోలీసులు ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు జరపడంతో బల్రాజ్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా, వైద్యుల బృందం సమక్షంలో చిన్నారి మృతదేహానికి వీడియో రికార్డింగ్తో కూడిన పోస్ట్మార్టం నిర్వహించారు.

Leave a Reply