బెంగళూరులో నెలకొన్న తీవ్రమైన నీటి ఎద్దడి నేపథ్యంలో, బెంగళూరు నీటి సరఫరా మరియు మురుగునీటి పారుదల మండలి (BWSSB) కఠినమైన కొత్త ఆంక్షలను విధించింది.
ఇకపై బెంగళూరు నగర వాసులు తమ వాహనాలను కడగడానికి, ఇంటి తోటలకు నీరు పెట్టడానికి, రోడ్లను శుభ్రం చేయడానికి లేదా స్విమ్మింగ్ పూల్స్ నింపడానికి కేవలం శుద్ధి చేసిన (Recycled) నీటిని మాత్రమే ఉపయోగించాలని ఆ మండలి ఛైర్పర్సన్ మంజుళా స్పష్టం చేశారు. సరఫరా చేసే తాగునీటిని కేవలం తాగడానికి మాత్రమే ఉపయోగించాలని, ఇతర అవసరాలకు వాడకూడదని చాలా స్పష్టంగా హెచ్చరించారు.
ఈ కఠినమైన ఆదేశాలను ఉల్లంఘించి, ఎవరైనా తాగునీటిని వృథా చేస్తే వారికి వెంటనే రూ. 5,000 జరిమానా విధిస్తామని ప్రకటించారు. అంతేకాకుండా, నిబంధనలను అతిక్రమించే వారి ఇంటికి చేసే నీటి సరఫరాలో 50 శాతం వెంటనే తగ్గిస్తామని బోర్డు షాకింగ్ నిర్ణయాన్ని వెల్లడించింది. నీటిని పొదుపు చేయడానికి మరియు వృథాను అరికట్టడానికి బెంగళూరు ప్రభుత్వం తీసుకున్న ఈ కఠిన చర్య, ప్రస్తుతం నగరం అంతటా పెద్ద చర్చకు దారితీసింది.

Leave a Reply