చిప్స్, శీతల పానీయాల ప్యాకెట్లపై ఈ హెచ్చరిక వచ్చి ఉంటే.. కొనే ముందే అసలు నిజం తెలిసేది! కంపెనీల వ్యతిరేకతతో ఏం జరిగిందో తెలుసా..?

చిప్స్, శీతల పానీయాలు (కూల్ డ్రింక్స్) వంటి ప్యాక్ చేసిన ఆహార పదార్థాలలో చక్కెర, ఉప్పు, కొవ్వు అధికంగా ఉంటే.. ఆ విషయాన్ని వినియోగదారులకు ముందే తెలియజేసేలా ప్యాకెట్ ముందుభాగంలో హెచ్చరిక లేబుళ్లను (Front-of-pack Warning Labels) ముద్రించాలనే ప్రతిపాదనపై భారతదేశంలో చాలా కాలంగా చర్చ జరుగుతోంది.

ఈ విషయమై దేశ సర్వోన్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) కూడా ఆహార భద్రతా సంస్థలను ప్రశ్నించింది.

ప్యాకెట్ ముందుభాగంలో స్పష్టంగా కనిపించేలా ఎరుపు రంగు హెచ్చరిక చిహ్నాలను ఏర్పాటు చేస్తే.. అధిక చక్కెర, ఉప్పు లేదా కొవ్వు ఉన్న ఆహార ఉత్పత్తులను వినియోగదారులు సులభంగా గుర్తించవచ్చని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఇలాంటి హెచ్చరిక చిహ్నాలు వినియోగదారులలో గందరగోళాన్ని సృష్టిస్తాయని, ఆహారం తీసుకునే పరిమాణాన్ని నియంత్రించడంపైనే దృష్టి పెట్టాలని ఆహార తయారీ కంపెనీలు వ్యతిరేకించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది.

మరోవైపు, భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) ముందుభాగంలో ముద్రించే హెచ్చరిక లేబుళ్ల ప్రతిపాదన నుంచి వెనక్కి తగ్గిందని.. దానికి బదులుగా చక్కెర, కొవ్వు, ఉప్పు తదితర పోషక విలువల వివరాలను నలుపు-తెలుపు (బ్లాక్ అండ్ వైట్) పట్టిక రూపంలో పేర్కొనే విధానాన్ని తెరపైకి తెచ్చినట్లు సమాచారం వెలువడింది.

ఈ నిర్ణయంపై ఆరోగ్య కార్యకర్తలు, నిపుణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధిక చక్కెర, ఉప్పు, కొవ్వు ఉన్న ప్యాక్డ్ ఫుడ్స్‌ను వినియోగదారులు సులభంగా గుర్తించడానికి ప్యాకెట్ ముందుభాగంలో స్పష్టమైన హెచ్చరిక ఉండటమే మేలని వారు గట్టిగా వాదిస్తున్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిశీలనలోనూ ఉంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *