లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ రెండో రోజున, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ సుదీర్ఘంగా నడుచుకుంటూ మైదానంలోకి అడుగుపెట్టిన కొద్ది నిమిషాల్లోనే ఔట్ కావడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తొలి టెస్ట్ మ్యాచ్లో వేలి గాయం కారణంగా దూరమైన బాబర్, ఈ మ్యాచ్ ద్వారా తిరిగి ఫామ్లోకి వస్తాడని ఆశించగా.. కేవలం 10 బంతుల్లో 2 ఫోర్లతో 8 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.
పాకిస్థాన్ జట్టు తొలి ఇన్నింగ్స్లో ఆదిలోనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడగా, బాబర్ ఇంత త్వరగా అవుటవ్వడం జట్టుపై మరింత ఒత్తిడిని పెంచింది. లార్డ్స్ పెవిలియన్ నుంచి ఆయన మైదానంలోకి నడిచి వచ్చిన 31 సెకన్ల వీడియో మ్యాచ్కు ముందు వైరల్ కాగా.. ఆయన క్రీజులో నిలిచిన సమయం కంటే, నడిచి రావడానికే ఎక్కువ సమయం పట్టిందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
“టీ చల్లారేలోపే మళ్లీ పెవిలియన్కు తిరిగొచ్చేశారు” అంటూ అభిమానులు, నెటిజన్లు మీమ్స్, కామెంట్లతో ఆటాడుకుంటున్నారు. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి పాకిస్థాన్ బ్యాటర్లు నిలవలేక తడబడుతున్న తరుణంలో, కెప్టెన్ బాబర్ ఆజమ్ ప్రదర్శించిన ఈ పేలవ ఆటతీరు క్రికెట్ అభిమానుల్లో తీవ్ర నిరాశతో పాటు నవ్వులు పూయిస్తోంది.

Leave a Reply