పుదుచ్చేరికి చెందిన పదో తరగతి విద్యార్థినిపై ఆమె సోషల్ సైన్స్ ఉపాధ్యాయుడు జార్జ్ లైంగిక దాడికి పాల్పడిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
చదువులో వెనుకబడిన విద్యార్థినులకు ఉచితంగా ట్యూషన్ చెబుతానంటూ ఒక గదిని అద్దెకు తీసుకున్న ఆ ఉపాధ్యాయుడు, బాధితురాలిని మాత్రమే మిగతా వారికంటే ముందుగా రప్పించి అఘాయిత్యానికి ఒడిగట్టేవాడు. ఉపాధ్యాయుడి చేష్టలను ఆ విద్యార్థిని వ్యతిరేకించగా, ఇంటర్నల్ మార్కులు తగ్గించి పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని, ఓ నకిలీ వీడియోను చూపిస్తూ స్కూల్ నుంచి తీసివేయిస్తానని తీవ్రంగా బెదిరింపులకు గురిచేసి నిరంతరం లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
ఉపాధ్యాయుడి వరుస అకృత్యాల కారణంగా ఆ మైనర్ బాలిక 3 నెలల గర్భవతిగా మారింది. లైంగిక దాడి గురించైనా, గర్భం గురించైనా సరైన అవగాహన లేని ఆ అమాయక బాలిక అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లగా ఈ షాకింగ్ నిజం బయటపడింది. బాలిక ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసి, కుటుంబంతో సహా పరారయ్యేందుకు యత్నించిన ఆ ఉపాధ్యాయుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. కాలేజీ మరియు పాఠశాలలో చదువుతున్న ముగ్గురు కుమార్తెలకు తండ్రైన వ్యక్తే తన విద్యార్థినిపై ఇంతటి ఘోరానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని, ఆగ్రహాన్ని రేకెత్తించింది.

Leave a Reply