చెంగల్పట్టు: తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా అచ్చరపాక్కం ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల జీవానందం అనే వ్యక్తికి.. అప్పటికే ఇద్దరు భార్యలు, పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ, ఆ బుద్ధి లేని వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన ఒక 15 ఏళ్ల మైనర్ బాలికను ప్రేమిస్తున్నానంటూ నమ్మించి మోసం చేస్తూ వచ్చాడు.
ఈ నెల 13వ తేదీన ఉత్తరమేరూర్ సమీపంలోని మల్లికాపురంలో ప్రముఖ సెయింట్ ఆంథోనీ చర్చి ఉత్సవాలు (తేర్ తిరువిజ్రా) జరిగాయి. ఈ జాతరను చూడటానికి వచ్చిన ఆ బాలికను జీవానందం నయవంచనతో లోబరుచుకున్నాడు. అనంతరం ఆమెపై ఒత్తిడి తెచ్చి, బలవంతంగా తాళి కట్టడమే కాకుండా.. ఆ బాలికపై అత్యంత దారుణంగా లైంగిక దాడికి ఒడిగట్టాడు.
బాధిత బాలిక మరియు ఆమె కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఘోర ఉదంతంపై నాన్ మంగలం మహిళా పోలీసులు తీవ్రంగా దర్యాప్తు చేపట్టారు. బాలికను అపహరించి, బాల్య వివాహం చేసుకుని, లైంగికంగా వేధించిన నేరానికి గానూ.. జీవానందంపై ‘పోక్సో’ (POCSO) చట్టంతో పాటు పలు కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీనిని పసిగట్టి పరారవ్వడానికి ప్రయత్నించిన నిందితుడు జీవానందాన్ని పోలీసులు నిన్న ముమ్మరంగా గాలించి అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు.

Leave a Reply