“నన్ను వదిలేయ్.. ప్లీజ్.” వేడుకున్న 17 ఏళ్ల విద్యార్థిని.. గొంతు కోసి చంపి పక్కనే పడి ఉన్న ప్రియుడు.. గుండెలను పిండేసే షాకింగ్ సంఘటన.!!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలో, బిసిఏ (BCA) మొదటి సంవత్సరం చదువుతున్న స్మృతి పాండే అనే 17 ఏళ్ల కళాశాల విద్యార్థిని, తన సొంత ఇంట్లోనే గొంతు కోసి అత్యంత దారుణంగా హత్యకు గురైంది.

ఈ సంఘటన గురించి సమాచారం అందుకుని హుటాహుటిన వచ్చిన పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో, అదే తరగతిలో చదువుతున్న దేవాంశ్‌ పాఠక్ అనే సహవిద్యార్థే ఈ దారుణ చర్యకు పాల్పడినట్లు తేలింది.

హత్య జరిగిన స్థలంలోనే గాయాలతో కనిపించిన నిందితుడు దేవాంశ్‌ పాఠక్‌ను పోలీసులు తక్షణమే అరెస్టు చేశారు. ఆ విద్యార్థిని వేరొక వ్యక్తితో సన్నిహితంగా మాట్లాడుతోందనే అనవసరమైన అనుమానంతోనే, ఆగ్రహంతో విద్యార్థిని ఇంట్లోకి చొరబడి ఈ హత్యకు ఒడిగట్టినట్లు తెలిసింది. ఈ దిగ్భ్రాంతికర హత్య సంఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని, భయాందోళనలను రేకెత్తించింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *